ఒక మహా పురుషుడు

నేనేమీ మత చాంధసవాదిని కాదు. అయినా ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు భింద్రన్వాలే ఫొటో పెట్టి మహా పురుషుడు అని ఎందుకంటున్నానా అని ఆశ్చర్యపోతున్నారా? ఎం.ఎఫ్.హుస్సేన్ పద్మభూషణుడు అవ్వగా లేనిది భింద్రన్వాలే మహా పురుషుడు అవ్వడం విచిత్రమా? ఎం.ఎఫ్.హుస్సేన్ ఒక పచ్చి బూతు చిత్రకారుడు. అతను బూతు పెయింటింగ్ లు వేసి కోట్లు సంపాదించాడు. భింద్రన్వాలే ఉగ్రవాదే కానీ అతను ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే చాలా నీతివంతుడు. భింద్రన్వాలే ఒక శుద్ధ శాఖాహారి. పంజాబ్ లో ఉగ్రవాదం బలంగా ఉన్న రోజుల్లో అక్కడ మాంసం దుకాణాలన్నీ బంద్. అప్పట్లో పంజాబ్ లో సిగరెట్లు, మద్యం అమ్మకాలు కూడా నిషిద్ధం. ఉగ్రవాదాన్ని కూడా ఇంత నీతివంతంగా నడిపిన భింద్రన్వాలే అశ్లీల పెయింటింగ్ లని అంగీకరించలేడు. అశ్లీల పెయింటింగ్ లు వేసి కోట్లు సంపాదించిన ఒక నీతిలేని మనిషికి పద్మభూషణం ప్రధానం చెయ్యబడినప్పుడు ఆదర్శ మూర్తి అయిన భింద్రన్వాలేకి అంత కంటే మహోన్నతమైన బహుమానం రావాలి.

తెలంగాణాకు కోస్తా ఆంధ్ర మంత్రుల మద్దతు

తెలంగాణాకు కోస్తా ఆంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు మద్దతు ప్రకటించారు. వారు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణారావు. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకి చెందిన వ్యక్తి. మోపిదేవి వెంకటరమణారావు గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు హైదరాబాద్ అభివృద్ధి పైనే ఎక్కువ కాన్సెంట్రేషన్ పెట్టారు కానీ ప్రాంతీయ అభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రాంతీయ అభివృద్ధి యొక్క ప్రాధాన్యతని గుర్తించిన కోస్తా ఆంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ & మోపిదేవి వెంకటరమణారావులే.

02

03 2010

పాకిస్తాన్ లో సిక్కుల పై తాలిబాన్ దాడులు

సర్వర్ మార్పిడి పూర్తైనది

సర్వర్ మార్పిడి పూర్తైనది

18

02 2010